Karnan : ఓటీటీలో ధనుష్ లేటెస్ట్ సూపర్హిట్ ‘కర్ణన్’..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ షూటింగులు నిలిచిపోయాయి.. థియేటర్లు మూతబడ్డాయి.. దీంతో ఆడియెన్స్కు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు పలు ఓటీటీల నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు..
Karnan: కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ షూటింగులు నిలిచిపోయాయి.. థియేటర్లు మూతబడ్డాయి.. దీంతో ఆడియెన్స్కు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు పలు ఓటీటీల నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు..
ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలతో పాటు, విడుదల వాయిదా పడిన సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమా తమిళనాట ఏప్రిల్ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను నిర్మించారు.. మే 14 నుండి అమెజాన్ ప్రైమ్లో ‘కర్ణన్’ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ ఆయన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నారు..
Bellamkonda Srinivas : రీమేక్లు నాకు మైసూర్ పాక్లు అంటున్న బెల్లం బాబు..