modi: ‘నేను ఏ ప‌ని చేస్తానో తెలుసా?’ అని అడిగిన మోదీ.. న‌వ్వులు పూయించే జ‌వాబు ఇచ్చిన చిన్నారి

'నేను ఎవ‌రో నీకు తెలుసా?' అని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా కుమార్తెను మోదీ అడిగారు. దీనికి ఆ పాప స్పందిస్తూ.. 'తెలుసు.. మీరు మోదీ జీ.. నేను మిమ్మ‌ల్ని టీవీలో చూశాను' అని చెప్పింది. దీంతో మోదీ మ‌ళ్ళీ మాట్లాడుతూ.. 'నేను ఏ ప‌ని చేస్తానో నీకు తెలుసా?' అని అడిగారు. ఆ పాప స్పందిస్తూ... 'మీరు లోక్‌స‌భ టీవీలో ప‌నిచేస్తారు' అని చెప్పింది. దీంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు. ఆ పాప‌కు మోదీ కొన్ని చాక్లెట్లు ఇచ్చి పంపారు.

modi: ‘నేను ఏ ప‌ని చేస్తానో తెలుసా?’ అని అడిగిన మోదీ.. న‌వ్వులు పూయించే జ‌వాబు ఇచ్చిన చిన్నారి

Modiji

modi: పార్లమెంటు ప్రాంగ‌ణంలో ఇవాళ ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న‌ను క‌లిసిన‌ ఓ చిన్నారిని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఓ ప్ర‌శ్న వేయ‌గా, ఆ చిన్నారి చెప్పిన స‌మాధానం నవ్వులు పూయించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నేత‌, బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా ఇవాళ త‌న కుటుంబంతో క‌లిసి పార్ల‌మెంటు వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు ప్ర‌ధాని మోదీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అనిల్ ఫిరోజియా కుమార్తె అహానా ఫిరోజియా (8)తో ప్ర‌ధాని మోదీ కాసేపు మాట్లాడారు.

‘నేను ఎవ‌రో నీకు తెలుసా?’ అని మోదీ అడిగారు. దీనికి ఆ పాప స్పందిస్తూ.. ‘తెలుసు.. మీరు మోదీ జీ.. నేను మిమ్మ‌ల్ని టీవీలో చూశాను’ అని చెప్పింది. దీంతో మోదీ మ‌ళ్ళీ మాట్లాడుతూ.. ‘నేను ఏ ప‌ని చేస్తానో నీకు తెలుసా?’ అని అడిగారు. ఆ పాప స్పందిస్తూ… ‘మీరు లోక్‌స‌భ టీవీలో ప‌నిచేస్తారు’ అని చెప్పింది. దీంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు. ఆ పాప‌కు మోదీ కొన్ని చాక్లెట్లు ఇచ్చి పంపారు.

కాగా, కొన్ని రోజుల క్రితం బ‌రువు త‌గ్గే ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ అనిల్ ఫిరోజియా ఫొటోలు బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సవాల్‌ను స్వీకరించి తాను 15 కేజీలు తగ్గానని, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆయనను కలిసి త‌న‌ బరువు గురించి వివరాలు చెబుతానన‌ని అన్నారు. బ‌రువు త‌గ్గితే నిధులు మంజూరు చేస్తాన‌ని గ‌డ్క‌రీ చెప్పార‌ని, ఆయన తన మాట నిలబెట్టుకుని రూ.15 వేల కోట్ల నిధులను త‌న‌ నియోజకవర్గానికి మంజూరు చేయాల‌ని అన్నారు.


India vs West Indies: అర్ధ సెంచ‌రీలు బాదిన ధావ‌న్‌, శుభ్‌మ‌న్