Eagle National Flag : జాతీయ పతాకాన్ని నోట కరచుకుని మానేరు డ్యామ్పై చక్కర్లు కొట్టిన గద్ద
కరీంనగర్ జిల్లా మానేరు డ్యామ్ దగ్గర అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ పక్షి తన దేశభక్తిని చాటుకుంది. ఓ గద్ద జాతీయ పతాకాన్ని నోట కరచుకుని కాసేపు డ్యాంపై ఆకాశంలో సందడి చేసింది. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుని ముక్కుమీద వేలేసుకునేలా చేసింది.
Eagle National Flag : కరీంనగర్ జిల్లా మానేరు డ్యామ్ దగ్గర అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ పక్షి తన దేశభక్తిని చాటుకుంది. ఓ గద్ద జాతీయ పతాకాన్ని నోట కరచుకుని కాసేపు డ్యాంపై ఆకాశంలో సందడి చేసింది. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటన అందరినీ ఆకట్టుకుని ముక్కుమీద వేలేసుకునేలా చేసింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా డ్యామ్ పై పలు చోట్ల జాతీయ జెండాలను కట్టారు. ఉదయం డ్యామ్ పైకి చేరుకున్న ఓ గద్ద ఓ జాతీయ పతాకాన్ని నోట కరచుకొని పైకి ఎగిరింది. కాసేపు జాతీయ పతాకంతో డ్యామ్ పై చక్కర్లు కొట్టింది.
CM KCR : ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలి : సీఎం కేసీఆర్
అనంతరం ఆ పతాకాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి మొబైల్ లో రికార్డ్ చేశారు. పక్షికి ఎంత దేభక్తి.. అనుకుంటూ మురిసిపోయారు.