ఈడీ హెడ్ క్వార్టర్స్ లో కరోనా కలకలం, ఆరుగురు ఉద్యోగులకు కొవిడ్

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో కలకలం రేపుతోంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానమైన కార్యాలయాల్లోనూ కరోనా కేసులు

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 05:28 AM IST
ఈడీ హెడ్ క్వార్టర్స్ లో కరోనా కలకలం, ఆరుగురు ఉద్యోగులకు కొవిడ్

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో కలకలం రేపుతోంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానమైన కార్యాలయాల్లోనూ కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో కలకలం రేపుతోంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానమైన కార్యాలయాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రక్షణశాఖ కార్యాలయంలో పని చేసే ఉన్నత అధికారికి కరోనా సోకింది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కరోనా తాకింది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ లో లోక్ నాయక్ భవన్ లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఆరుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. వీరిలో ఓ అధికారితో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 

ఈడీ హెడ్ క్వార్టర్స్ మూసివేత:
కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో కరోనా సోకిన వారితో 20 మంది ఈడీ అధికారులు కలిసి పనిచేశారని తేలడంతో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ లకు కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు. ఈడీ కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. అలాగే అధికారులు ప్రయాణిస్తున్న కార్లను కూడా శానిటైజ్ చేస్తున్నారు. రేపటి వరకు ఈడీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు.

24 గంటల్లో 9887 కేసులు, 294 మరణాలు:
దేశంలో కరోనా వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. కంటికి కనిపించని శత్రువు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్‌లో గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 9887 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసులే కాదు మరణాలు పెరుగుగుతున్నాయి. కొత్తగా 294 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 36వేల 657కి చేరగా, మృతుల సంఖ్య 6వేల 642కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో లక్ష 14వేల 72మంది కోలుకున్నారు. మరో లక్ష 15వేల 942మంది వేర్వురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 6వ స్థానం:
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానంలో ఉంది. దేశంలో మృతుల సంఖ్య ఇలాగే కొనసాగితే తొందర్లోనే కెనడాను (7703)ను దాటే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం 9వ స్థానంలో ఉన్న భారత్‌ కేవలం ఏడు రోజుల వ్యధిలో ఆరో స్థానానికి చేరింది. దేశంలో రికవరీ రేటు శుక్రవారం కంటే కొద్దిగా తగ్గి 48.20 శాతానికి చేరింది. నిన్న(జూన్ 5,2020) ఇది 48.27 శాతం ఉంది.

80వేల కరోనా కేసులతో టాప్ లో మహారాష్ట్ర:
మన దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర (80వేల 229) మొదటిస్థానంలో ఉంది. 28వేల 694 పాజిటివ్‌ కేసులతో తమిళనాడు, 26వేల 334 కరోనా కేసులతో ఢిల్లీ వరుగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌ (19వేల 94), రాజస్థాన్‌ (10వేల 84), ఉత్తరప్రదేశ్‌ (9వేల 733), మధ్యప్రదేశ్‌ (8వేల 996), పశ్చిమబెంగాల్‌ (7వేల 303) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ లో సడలింపులు తర్వాత పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో ఇటలీని దాటి భారత్ 6వ స్థానానికి చేరింది. 2లక్షల 34వేల 531 కేసులతో ఇటలీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉండగా, లక్ష 87వేల 400 కేసులతో పెరూ 8వ స్థానానికి ఎగబాకింది. 19లక్షల 35వేల 432 కేసులతో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కంటిన్యూ అవుతోంది.

కేసుల వారీగా తొలి 10 స్థానాల్లో ఉన్న దేశాలు:
అమెరికా – 19,35,432
బ్రెజిల్ – 6,46,006
రష్యా – 4,49,834
స్పెయిన్ – 2,88,058
బ్రిటన్ – 2,83,311
భారత్ – 2,36,657
ఇటలీ – 2,34,531
పెరూ- 1,87,400
జర్మనీ- 1,85,413
టర్కీ – 1,68,340

Read: రెస్టారెంట్ వాటర్‌ట్యాంక్‌లో శవాలై తేలిన సిబ్బంది..