ED Raids: జేసీ సోదరుల ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తి

అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ED Raids: జేసీ సోదరుల ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తి

Ed Raids

ED Raids: ఏపీ టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్వహించిన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి ముగిశాయి. దాదాపు 17 గంటలపాలు ఈ సోదాలు జరిగాయి. అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ సోదరుల ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్‌రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.

Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. ఈ అంశంపై ఏపీ రవాణా శాఖ అధికారులు ఈడీకి పూర్తి సమాచారం అందజేశారు. ఈడీ అధికారుల సోదాలు పూర్తైన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఈడీ అధికారులు తనిఖీలు చేసి వారికి కావాల్సిన పత్రాలు తీసుకెళ్లారు. సోదాల సందర్భంగా నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందా? లేదా? అనేది నాకు తెలియదు. మూడు రోజుల తర్వాత ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. అప్పుడు స్పందిస్తా’’ అంటూ జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.