Maharashtra: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మహారాష్ట్ర ప్రత్యేకమని చెప్పారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో దాదాపు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్న విషయం తెలిసిందే.
Maharashtra: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మహారాష్ట్ర ప్రత్యేకమని చెప్పారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో దాదాపు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేలతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. గతంలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సర్కారుని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
Kamalhaasan : అక్కడ ‘బాహుబలి2’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘విక్రమ్’
అలాగే, రాజస్థాన్లోనూ బీజేపీ జరిపిన ప్రయత్నాలను గుర్తుకు తెచ్చారు. ఏక్నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలు గుజరాత్లోని సూరత్లో ఉన్నట్లు తనకు తెలిసిందని అన్నారు. వారిని అక్కడి నుంచి కొందరు పంపించట్లేదని ఆరోపించారు. అయితే, వారు తప్పకుండా తిరిగి వస్తారని, శివసేన కోసం వారు అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం సూరత్లోని తమ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై తాము సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో చర్చిస్తున్నామని చెప్పారు.