Krunal Pandya: భారత జట్టులో 8మందిని కలిసిన పాండ్యా.. మ్యాచ్‌లు జరిగేనా?

భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్‌, శ్రీలంక జట్లు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి.

Krunal Pandya: భారత జట్టులో 8మందిని కలిసిన పాండ్యా.. మ్యాచ్‌లు జరిగేనా?

Krunal Pandya

IND vs SL T20 Postponed: భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్‌, శ్రీలంక జట్లు క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. బీసీసీఐ ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం, ఇరు జట్ల ఆటగాళ్ళు మరియు సిబ్బందికి కరోనా టెస్ట్‌లు జరుగుతున్నాయి.

ఈ మ్యాచ్ బుధవారం(జూలై 28) జరిగే అవకాశం కూడా అంతంత మాత్రమేనని అంటున్నారు. ఎందుకంటే, క్రునాల్ పాండ్యాతో సన్నిహితంగా ఎనిమిది మంది భారత ఆటగాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా భారత్‌ ఈ సిరీస్‌లో ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సిరీస్‌కు ముప్పు పొంచి ఉంది. క్రునాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు పాజిటివ్ రాకపోతేనే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. క్రునాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు కరోనా నెగటివ్ వస్తేనే తర్వాతి రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎనిమిది మంది కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరికి బుధవారం ఉదయం పరీక్షలు చేయవలసి ఉంది.

అయితే, ఇప్పటివరకు జట్టులో ఎవరికీ కూడా కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతానికి, ఉన్న సమాచారం ప్రకారం.. రెండవ టీ20 బుధవారం జరుగుతుందని, మూడవ టీ20 గురువారం(జూలై 29) కొనసాగుతుందని బిసిసిఐ ధృవీకరించింది.