England vs India: భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్‌

ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతోన్న‌ మూడో వ‌న్డే మ్యాచులో ఆతిథ్య జ‌ట్టు 45.5 ఓవ‌ర్ల‌కే కుప్ప‌కూలింది. 259 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

England vs India: భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్‌

India

England vs India: ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతోన్న‌ మూడో వ‌న్డే మ్యాచులో ఆతిథ్య జ‌ట్టు 45.5 ఓవ‌ర్ల‌కే కుప్ప‌కూలింది. 259 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్ జ‌ట్టు ఆదిలోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు (బెయిర్‌స్టో, జో రూట్.. డ‌కౌట్) కోల్పోయిన‌ప్ప‌టికీ మిగ‌తా ఆట‌గాళ్ళు క్రీజులో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేశారు.

K Kavitha: రాహుల్ గాంధీ భార‌త్‌లోనే ఉన్నారా?: క‌విత చుర‌క‌లు

జాస‌న్ రాయ్ 41, బెయిర్‌స్టో 0, జోరూట్ 0, బెన్ స్టోక్స్ 27, జోస్ బ‌ట్ల‌ర్ 60, మోయీన్ అలీ 34, లియాం లివింగ్‌స్టోన్ 27, డేవిడ్ విల్లే 18, క్ర‌యిగ్ ఓవ‌ర్ట‌న్ 32, బ్రిడాన్ 3 (నాటౌట్‌), రీసీ టోప్లే 0 ప‌రుగులు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా 4, య‌జువేంద్ర చాహ‌ల్ 3, మొహ‌మ్మ‌ద్ సిరాజ్ 2, ర‌వీంద్ర జ‌డేజా 1 వికెట్టు తీశారు. కాగా, మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో టీమిండియా-ఇంగ్లండ్ చెరో మ్యాచ్‌లో విజ‌యం సాధించాయి. దీంతో నేటి మ్యాచులో గెలిచే జ‌ట్టు విజేత‌గా నిలుస్తుంది.