India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా

టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్‌కు దిగింది.

India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా

India vs England: టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది.

Lalu Prasad Yadav: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకారం… సింగపూర్‌లో శస్త్రచికిత్స

ఈ రోజు మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. మలాన్, మార్క్ వుడ్ స్థానంలో ఫిలిప్ సాల్ట్, జోర్డాన్‌కు చోటు కల్పించింది. ఇండియాకు సంబంధించి అందరూ అనుకున్నట్లుగానే దినేష్ కార్తీక్ బదులు రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అడిలైడ్‌కు సంబంధించి ఇక్కడ గత 11 మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్లు ఓటమి పాలయ్యాయి. రెండు జట్ల వివరాలివి.

ఇండియా: రోహత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మొహ్మద్ షమి.

ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్.