India vs New Zealand: న్యూజిలాండ్తో తొలి వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వేదికగా మొదటి వన్డే శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది.
India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి వన్డే ప్రారంభమైంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది.
Arvind Kejriwal: కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. మనీష్ సిసోడియా ఆరోపణ
భారత జట్టు కెప్టెన్గా శిఖర్ ధావన్ కొనసాగుతున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు తొలిసారిగా వన్డే జట్టులోకి అరంగేట్రం చేస్తున్నారు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ ఇద్దరూ ఈ రోజు మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు. ఇప్పటికే 1-0తో టీ20 సిరీస్ స్వాధీనం చేసుకున్న భారత జట్టు వన్డే సిరీస్ను కూడా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్.