YS Sharmila : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి : షర్మిల

పెద్దపల్లి జిల్లా మంథనిలోని వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ..‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి అంటూ విమర్శలు సంధించారు.

YS Sharmila : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి : షర్మిల

Floods In Telangana.. Sharmila Criticizes Cm Kcr

YS Sharmila : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు..వరదలు రాజకీయం రంగులు పులుముకున్నాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్లే భద్రాచలం మునిగిపోయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈక్రమంలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా రాజకీయం రంగుపులుముకుంది. తెలంగాణలో వరద రాజకీయం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ వరదలు పలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఈ క్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తీవ్ర విమర్శలు చేశారు.

పెద్దపల్లి జిల్లా మంథనిలోని వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. వరదల్లో మునిగిపోయిర పంటపొలాలను పరిశీలించారు. 10,000 ఎకరాల్లో పంటపొలాలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఓ ‘పెట్ ప్రాజెక్టు’ అంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదుగానీ..కేసీఆర్ కు మాత్రం మంచి కలెక్షలు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు షర్మిల. కలెక్షన్లు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు అంటూ విమర్శలు సంధించారు.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్‌ హీట్ పెరుగుతోంది. బాధితులకు పరామర్శలు చేస్తూనే, రాజకీయ సెగలు రేపుతున్నాయి విపక్షాలు. వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల (YS.Sharmila), వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె.. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల రాక సందర్భంగా వైఎస్సార్‌టీపీ నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలతో కార్యకర్తలు గ్రామాల్లో హడావిడి చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మరో రెండు రోజులపాటు షర్మిల టూర్‌ కొనసాగనుంది.

వారం రోజుల క్రితం కురిసిన వర్షాలు, వరదలతో తెలంగాణ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కారణంగా మంచిర్యాల, మంథని, కాళేశ్వరం, భద్రాచలం నీట మునిగాయి. భద్రాచలం రామాలయం నీట మునిగింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా నీటిమట్టం 70 అడుగులు దాటింది. పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి. బాధితులను పునారావాస కేంద్రాలకు తరలించి, ఆశ్రయం కల్పించారు.

భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేలు ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, తదుపరి పర్యటనలో దీనిపై పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.