congress: ఇప్పుడే ఆట మొదలైంది: కార్పొరేటర్ విజయా రెడ్డి
పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
congress: పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె నేడు 10 టీవీతో మాట్లాడుతూ… ఇప్పుడే ఆట మొదలైందని, టీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్లో చేరతారని చెప్పారు. కాంగ్రెస్కు, పీజేఆర్కు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రజా సమస్యలపై రేపటి నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తానని తెలిపారు.
JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు
టీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన కార్పొరేటర్ పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారని చెప్పారు. చాలామంది ఇతర పార్టీల నుంచి గెలిచి మంత్రులుగా ఉన్నారని ఆమె చెప్పారు. అలాంటప్పుడు కార్పొరేటర్ పదవికి పెద్ద ఇబ్బంది ఉండదని తెలిపారు. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా పని చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎలాంటి హామీ లేదని చెప్పారు. మొదటగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నుంచి పని ప్రారంభిస్తానని వివరించారు.