‘ఏది మనిషిని చంపి రుచి చూస్తుందో అదే మ్యాన్ ఈటర్’..

‘ఏది మనిషిని చంపి రుచి చూస్తుందో అదే మ్యాన్ ఈటర్’..

Garjana Trailer: ‘ఆడవారి మాటలకు అర్థాలేవేరులే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోలీవుడ్ యంగ్ హీరో శ్రీకాంత్ (శ్రీరామ్), రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా.. జె.పార్థీబన్ దర్శకత్వంలో జాగ్వార్ స్టూడియోస్ నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ‘గర్జన’.. ఇటీవల విడుదల చేసిన టీజర్‌‌కి మంచి స్పందన లభించింది. రీసెంట్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Garjana

ఓ ఇంట్లోకి పులి ప్రవేశించడం.. దాని నుండి తప్పించుకోవడానికి కథానాయిక, ఆమె స్నేహితురాలు, చిన్న పాప ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. అటవీ అధికారి ఆ పులిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది ట్రైలర్‌లో చూపించారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఓ పులి ఎక్కువ సేపు తెరపై కనిపించడం అనేది ఈ ‘గర్జన’ సినిమాలోనే కావడం విశేషం.

దేవ్ గిల్, నైరా, వషన్ని, ఆరోహి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. త్వరలో ‘గర్జన’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యూజిక్ : అరుల్‌దేవ్, ఎడిటింగ్ : ఆర్.సుదర్శన్, స్టోరీ, స్క్రీన్‌ప్లే అండ్ సినిమాటోగ్రఫీ : ఎమ్.వి.పన్నీర్ సెల్వం, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ఎమ్.నరేష్ జైన్, ప్రొడ్యూసర్ : బి.వినోద్ జైన్, దర్శకత్వం: జె.పార్థీబన్.