డబీర్ పురాలో ఎంఐఎం విజయం

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 01:31 PM IST
డబీర్ పురాలో ఎంఐఎం విజయం

MIM victory DabirPura : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం రెండో విజయం సాధించింది. తొలి విజయం మెహిదీపట్నంలో లభించిగా డబీర్ పురాలో రెండో విజయం సాధించింది. మెహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. డబీర్ పురాలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. మెట్టుగూడలో టీఆర్ఎస్, ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.



తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. మెజారిటీ స్థానాల్లో కారు జోరు కొనసాగుతోంది. 51 పైగా స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 23 స్థానాల్లో ఎంఐఎం ముందంజలో ఉంది. 26 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.