అర్ధరాత్రి 12 గంటల వరకు.. మందుబాబులకు కిక్కే కిక్కు!

అర్ధరాత్రి 12 గంటల వరకు.. మందుబాబులకు కిక్కే కిక్కు!

telangana liquor shops open till 12 am : తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. మద్యం దుకాణాల బంద్ చేసే విషయంలో రాష్ట్ర సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా మరో గంటపాటు తెరిచే ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే అవకాశం ఉండేంది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. క్లబ్, బార్లకు కూడా టైమింగ్ పెంచింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతినిచ్చింది.

మరోవైపు..పోలీసులు కూడా మద్యం సేవించి..రోడ్డెక్కే వాహనదారుల తాట తీసేందుకు పోలీసులు రెడీ అయిపోతున్నారు. తాగి వాహనం నడిపితే కఠినంగా శిక్షిస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. తాగి బండి నడిపితే..వారి ఆఫీసులకు సమాచారం చేరవేస్తామని, మొదటిసారి పట్టుబడితే..రూ. 10 వేలు ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక రెండోసారి పట్టుబడితే..రూ. 15 వేలు జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మరోవైపు..హైదరాబాద్ సిటీలో పోలీసు హై కమాండ్ ఆర్డర్ ప్రకారం.. పలు ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా నిలిపేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు.