తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇలా ఇస్తారు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. టెన్త్ క్లాస్ ​పరీక్షలు నిర్వహించకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 10:10 AM IST
తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇలా ఇస్తారు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. టెన్త్ క్లాస్ ​పరీక్షలు నిర్వహించకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. టెన్త్ క్లాస్ ​పరీక్షలు నిర్వహించకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 5లక్షల 34వేల 903 మంది టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​ ఉన్నారు. వీరిలో 5లక్షల 9వేల 079 మంది రెగ్యులర్ స్టూడెంట్స్​ కాగా.. 25వేల 824 మంది ప్రైవేటు స్టూడెంట్స్ ఉన్నారు. 

ఇక టెన్త్​లో ప్రతి సబ్జెక్టులో వంద మార్కులు ఉండగా, దీంట్లో రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, ఫార్మెటివ్​ అసెస్మెంట్​ ద్వారా మరో 20 మార్కులు కేటాయిస్తారు. ఎఫ్​ఏ పరీక్షలను అకడమిక్​ ఇయర్​లో ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తారు. ఈ మొత్తంలో యావరేజ్​ మార్కులను తీసుకొని.. దానికి ఐదు రెట్లు పెంచుతారు. అలా పెంచినదాన్ని పూర్తిస్థాయి మార్కులుగా పరిగణించనున్నారు. దీని ఆధారంగా గ్రేడ్స్, పాయింట్లు కేటాయించనున్నారు. ప్రతి సబ్జెక్టుకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. 

ఒక సబ్జెక్టుకి సంబంధించి నాలుగు ఎఫ్​ఏ ఎగ్జామ్స్​లో యావరేజ్​గా 10 మార్కులు వస్తే.. పూర్తి స్థాయి మార్కులు 50 వచ్చినట్లుగా నిర్ధారిస్తారు. అదే నాలుగు ఎఫ్​ఏల్లో యావరేజ్​గా 20 మార్కులు వస్తే.. పూర్థి స్థాయి మార్కులు 100 వచ్చినట్లుగా పేర్కొంటారు. ఇక రెగ్యులర్ స్టూడెంట్స్​కు సంబంధించిన ఈ ఇంటర్నల్ మార్కుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్​లైన్​ ద్వారా సేకరించింది. వాటి ఆధారంగా ఈసారి స్టూడెంట్స్​కు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రైవేటు స్టూడెంట్స్​కు సంబంధించి గతంలో ఎఫ్ఏ పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి, ఆ మార్కులకు పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగితే, వారం పది రోజుల్లో గ్రేడింగ్ ​రిజల్ట్స్ ​వచ్చే అవకాశాలున్నాయి. సర్కారు తీసుకున్న నిర్ణయంతో కేవలం స్కూళ్లలో ఇంటర్నల్​గా జరిగిన పరీక్షలకు హాజరు కాని వారు మాత్రమే ఫెయిల్ అవుతారు. 

* ఇక స్టూడెంట్స్​కు వచ్చిన మార్కుల ఆధారంగా సీసీఈ విధానంలో 8  గ్రేడ్స్ ఇస్తారు. 
* దీంట్లో 91 మార్కుల నుంచి 100 మార్కుల వరకు వస్తే ఆ స్టూడెంట్​కు A1 గ్రేడ్​గా గుర్తించి పది గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. 
* 81 నుంచి 90 మార్కులు వచ్చిన వారికి A2 గా.. 71 నుంచి 80 మార్కులు వచ్చిన వారికి B1 గ్రేడ్ కేటాయించనున్నారు. 
* 61 నుంచి 70 మార్కులు వచ్చిన వారికి B2 గ్రేడ్‌ ఇస్తారు. 
* ఇక 51 నుంచి 60 మార్కులు వచ్చిన వారికి C1 గ్రేడ్.. 
* 41 నుంచి 50 మార్కులు వచ్చిన వారికి C2 గ్రేడ్ ఇవ్వనున్నారు. 
* 35 నుంచి 40 మార్కులు వచ్చిన వారు D1 గ్రేడ్ లోకి వస్తారు. 
* జీరో నుంచి 34 మార్కుల వరకొస్తే డీ 2 గ్రేడ్ లోకి వస్తారు. 
* డీ 2  గ్రేడ్ అంటే ఫెయిల్​గా పరిగణిస్తారు. 
అయితే ఇంటర్నల్​ మార్కుల్లో ప్రైవేటు స్కూల్స్​ దాదాపు 20కి 20 మార్కులు వేసుకుంటారని, సర్కారు స్కూల్స్​లో తక్కువ మార్కులు వేస్తారనే విమర్శ మొదటి నుంచి ఉంది.

Read: సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు, దుబాయ్‌లో ఉండే రాజుపై లుకౌట్ నోటీసు