Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..

కిరాణం దుకాణంలో గతంలో చేసిన అప్పును అడిగినందుకు సదరు దుకాణ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాపారిని హత్యచేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు ..

Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..

Murdhar

Crime News: కిరాణం దుకాణంలో గతంలో చేసిన అప్పును అడిగినందుకు సదరు దుకాణ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాపారిని హత్యచేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశలోని టండా ధాకి గ్రామంలో చోటు చేసుకుంది.

Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు

శివాల కలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండా ధాకి గ్రామంలో యశ్‌పాల్‌(50)కి కిరాణా దుకాణం ఉంది. అదే ప్రాంతానికి చెందిన భూపేంద్ర, ఆయన సోదరుడు యోగేంద్ర, ఆషిలు దుకాణం వద్దకు వెళ్లి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు 30 రూపాయలు దుకాణం వ్యాపారికి బాకీ పడ్డారు. శనివారం రాత్రి సమయంలో దుకాణం వద్దకు వచ్చిన వారిని రూ. 30 ఇవ్వాలని దుకాణం వ్యాపారి నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు కర్రలతో యాశ్ పాల్ పై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాశ్ పాల్ ప్రాణఆలు విడిచాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..

అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) రామ్ అర్జ్ మాట్లాడుతూ.. భూపేంద్ర, అతని సోదరులు యోగేంద్ర, ఆషి తమకు గతంలో అప్పుగా ఇచ్చిన రూ.30 డిమాండ్ చేసినందుకు దుకాణదారు యశ్‌పాల్‌పై కర్రలతో దాడి చేశారని తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రామ్ అర్జ్ తెలిపారు.