మ‌ళ్లీ లాక్ డౌన్ వైన్స్ షాపులకు ప‌రుగో ప‌రుగు

  • Published By: madhu ,Published On : June 17, 2020 / 07:06 AM IST
మ‌ళ్లీ లాక్ డౌన్ వైన్స్ షాపులకు ప‌రుగో ప‌రుగు

మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారంట‌..మందు తాగ‌క‌క‌పోతే…రోజు గ‌డ‌వ‌దు..చ‌లో లిక్క‌ర్ షాప్ అంటున్నారు మ‌ద్యం బాబులు. ఎందుకంటే..2020, జూన్ 19వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించ‌న‌న్న ప్రాంతాల్లో వైన్స్ షాపుల ఎదుట జ‌నాలు బారులు తీరుతున్నారు. చాంతాడంత క్యూ ఉండ‌డంతో..త‌మ‌కు బాటిల్స్ దొరుకుతాయా ? లేదా అనే టెన్ష‌న్ లో ఉన్నారు మందుబాబులు.

భారీగానే మందు బాటిల్స్ కొనుగోలు చేస్తున్నార‌ని స‌మాచారం. త‌మిళ‌నాడు రాష్ట్రంలో నాలుగు జిల్లాలో లాక్ డౌన్ విధించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా వైర‌స్ త‌మిళ‌నాడు రాష్ట్రంలో విప‌రీతంగా విస్త‌రిస్తోంది. ప్ర‌దానంగా చైన్నై, కాంచిపురం, చంగ‌ల్ప‌ట్టు, తిరువ‌ళ్లూరు జిల్లాల్లో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

దీంతో ఈ జిల్లాల్లోనే…పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాల‌ని సీఎం ప‌ళ‌ని స్వామి నిర్ణ‌యించారు. జూన్ 19వ తేదీ నుంచి నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. 11 రోజుల పాటు లాక్ డౌన్ ఉండ‌డంతో మ‌ద్యం దొర‌క‌ద‌నే విష‌యం తెలిసిందే. ముందుగానే మందు బాటిళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని భావించి..వైన్స్ షాపుల ఎదుట ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. ఉద‌యం నుంచే వ‌ద్ద కిలోమీట‌ర్ల  మేర క్యూలు క‌నిపిస్తున్నాయి. 

Read: కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయమని కోరిన పిటీషనర్ కు రూ.5లక్షలు ఫైన్ వేసిన హైకోర్టు