రసాయనాలు వాడకుండానే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కరెన్సీ నోట్లు శానిటైజ్ చేసేందుకు హైదరాబాద్ డీఆర్డీవో కొత్త ఆవిష్కరణ
ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు.
ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు.
ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు. కరోనా నుంచి రక్షించేందుకు ప్రజలపైనా శానిటైజర్లను చల్లుతున్నారు. కొన్ని మొబైల్ శానిటైజేషన్ గదులను కూడా తయారు చేశారు. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను రసాయనాలు లేదా క్రిమి సంహారకాలతో శుద్ధి చేసేందుకు వీలుపడదు. ఉదాహరణకు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఐప్యాడ్ లు, కరెన్సీ నోట్లు, చలాన్లు. వీటిపై శానిటైజర్ను స్ప్రే చేయడం సాధ్యపడదు. దీనివల్ల వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది.
యూవీ కిరణాలతో శుభ్రం చేస్తుంది:
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ను రసాయన రహితంగా అంతమొందించేందుకు హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ల్యాబ్ ఓ పరికరాన్ని రూపొందించింది. అది కాంటాక్ట్ లెస్ శానిటైజేషన్ కేబినెట్. దాని పేరు Defence Research Ultraviolet Sanitizer (DRUVS). మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, కరెన్సీ నోట్లు, చలాన్లు మొదలైన వాటిని శుభ్రపరిచేందుకు ఇది రూపొందించబడిందని డీఆర్డీవో తెలిపింది. ఈ కేబినెట్ యూవీ(అతినీలలోహిత) కిరణాల సాయంతో సెన్సార్ల ఆధారంగా పని చేస్తుంది. ఇందులో ఓ డ్రాయర్ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా కాంటాక్ట్ లెస్ గా ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇది ప్రతీ వస్తువును, పరికరాన్ని 360 డిగ్రీల్లో యూవీ కిరణాలతో శుభ్రం చేస్తుంది. క్లీన్ అయిన తర్వాత, సిస్టమ్ స్లీప్ మోడ్లోకి వెళుతుంది.
ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, కరెన్సీ నోట్లు, చెక్ నోట్లు, చలాన్లు, పాస్బుక్లు, పేపర్, ఎన్వలప్ లు శుభ్రం:
“ఆర్సిఐ, డిఆర్డిఓ, హైదరాబాద్… మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, కరెన్సీ నోట్లు, చెక్ నోట్లు, చలాన్లు, పాస్బుక్లు, పేపర్, ఎన్వలప్లను శుభ్రపరచడానికి ఆటోమేటెడ్ కాంటాక్ట్లెస్ యువిసి శానిటైజేషన్ క్యాబినెట్ ‘డ్రూవ్స్'(DRUVS) ను అభివృద్ధి చేసింది. ఇది ఆటోమేటెడ్ యువీసీ కరెన్సీ శానిటైజింగ్ పరికరం ”NOTESCLEAN” అని రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ కేబినెట్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయొచ్చని డీఆర్డీవో తెలిపింది.
కరోనాను చంపే మరో పరికరం యూవీ బ్లాస్టర్:
కాగా, ఇటీవలే భారత ప్రభుత్వ రక్షణ సంస్థ డీఆర్డీవో మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. దానికి ‘యూవీ బ్లాస్టర్’ అని నామకరణం చేసింది. ఇది యూవీ(అతినీలలోహిత) కిరణాల సాయంతో పనిచేస్తుంది. ఇది ఓ టవర్ ఆకారంలో ఉంటుంది. కంప్యూటర్లు, టీవీలు, ల్యాప్టాప్ల వంటి ఉపకరణాల ఉపరితలాలను అతినీల లోహిత(యూవీ) కిరణాలతో శుద్ధిచేయగల ఈ టవర్ను డీఆర్డీఓ- లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ రూపొందించింది. రసాయనాలు, క్రిమిసంహారకాలతో శుద్ధిచేసేందుకు వీలుపడని ప్రతీ వస్తువును, పరికరాన్ని ఇది 360 డిగ్రీల్లో యూవీ కిరణాలతో శుభ్రం చేయగలదు. 43 వాట్ల యూవీ-సీ బల్బులు ఆరు ఇందులో ఉంటాయి. ఇవి 254 నానోమీటర్ తరంగ దైర్ఘ్యంతో పనిచేస్తుంది. ఈ పరికరం wifi ద్వారా ఆపరేట్ చేసే వీలుంది. 12 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలిగిన గదిని వైరస్ రహితంగా శానిటైజ్ చేసేందుకు 10 నిమిషాల సమయం పడుతుంది. 400 చదరపు అడుగుల ఏరియా శుద్ధికి అరగంట సమయాన్ని తీసుకుంటుంది.
పూర్తిగా రసాయన రహితంగా పని చేసే యూవీ బ్లాస్టర్:
ఆఫీసులు, లేబోరేటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాకుండా జనసమర్థం ఎక్కువగా ఉండే విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో ఈ యూవీ బ్లాస్టర్ను వినియోగించి పరిసరాలన్నింటినీ శానిటైజ్ చేయవచ్చని తెలిపింది. ఈ పరికరం పూర్తిగా రసాయన రహితంగా పని చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ పరికరాన్ని ఏదైనా గదిలో ఉంచి ఆన్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ గదిలోకి ఎవరైనా ప్రవేశించారంటే వెంటనే పరికరం ఆఫ్ అయిపోతుందని, దీనివల్ల మనుషులపై దీని ప్రభావం ఉండదని డీఆర్డీవో తెలిపింది.
Read More :