స్నేహితుడి భార్యను తీసుకెళ్లి…వేరు కాపురం..ప్రశ్నించిన బంధువుని కొట్టి చంపేసిన దారుణం

స్నేహితుడి భార్యను తీసుకెళ్లి…వేరు కాపురం..ప్రశ్నించిన బంధువుని కొట్టి చంపేసిన దారుణం

Hyderabad: MP man A friend’s wife controversy  Man killed : స్నేహం అనే మాటకు అర్థమే మార్చేశాడో మోసగాడు. భార్య అనే బంధానికి మచ్చ తెచ్చిందో మహిళ. స్నేహితుడి భార్యపై కన్నేసిన సదరు వ్యక్తి అతని భార్యకు లేనిపోని మాటలు చెప్పి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేశాడు. ఆ భార్య కూడా అతని వల్లో పడింది. వల్లో పడింది అనేకంటే అతనిపై నమ్మకంతోనే లేక..ఆశతోనో భర్త స్నేహితుడి వెంట హైదరాబాద్ వచ్చేసింది.

అలా స్నేహితుడి భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేసి కుందన్ బాగ్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దాంట్లో పెట్టాడు. అది తెలిసిన అతని స్నేహితుడి బంధువు వచ్చి ఇదేం పని అని ప్రశ్నించిన పాపానికి అతన్ని దారుణంగా కొట్టి అతని చావుకు కారణమైన ఘటన బేగంబజార్ లో కలకలం రేపింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన యోగేష్ అట్లా, అంకిత్ శుక్లాలు స్నేహితులు. యోగేష్ హైదరాబాద్ లోని బేగంబజార్ లో వ్యాపారం చేస్తున్నాడు. ఈక్రమంలో నెల రోజుల క్రితం యోగేష్ ఇండోర్ వెళ్లాడు. అలా వెళ్లిన యోగేష్ అంకిత్ భార్యకు మాయ మాటలుచెప్పి హైదరాబాద్ తీసుకొచ్చేశాడు. కుందన్ బాగ్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుని దాంట్లో ఉంచాడు.

ఈక్రమంలో అంకిత్ తన భార్య కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అంకిత్ భార్య గురించి గాలించగా..ఆమె కుందన్ బాగ్ లో ఉందని గుర్తించారు. దీంతో గత శుక్రవారం (జనవరి 29) అంకిత్ అతని మామ 65 ఏళ్ల విశ్వ సుందర్ కలిసి హైదరాబాద్ లోని వాళ్లు ఉండే ఇంటికొచ్చి యోగేష్ ను నిలదీశారు.

దీంతో రెచ్చిపోయిన యోగేష్ విశ్వ సుందర్ పై చేయి చేసుకున్నాడు. తోసివేశాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా అతను మరణించాడు. అది తెలిసిన యోగేష్ పరారయ్యాడు. దీంతో పోలీసులు యోగేష్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అతని కోసంగాలిస్తున్నారు.