శ్రుతి అరెస్ట్.. పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి ఏకంగా రూ.11కోట్లు కొట్టేసిన కిలేడీ

శ్రుతి అరెస్ట్.. పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి ఏకంగా రూ.11కోట్లు కొట్టేసిన కిలేడీ

hyderabad police arrest shruti: హైదరాబాద్ పోలీసుల కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో ఆమె ఘరానా మోసం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11కోట్ల రూపాయలు కాజేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది.

పెళ్లి పేరుతో ఘరానా మోసం:
బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు శ్రుతి సిన్హా. జల్సాలకు అలవాటు పడింది. ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కింది. నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారిపై కన్నేసిన శ్రుతి తన మాయ మాటలతో అతడిని మచ్చిక చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. శ్రుతి మాయలో పడిన వ్యాపారి.. ఆమె అడిగినంత డబ్బు ఇవ్వడం మొదలు పెట్టాడు. అలా.. వ్యాపారి నుంచి పలుమార్లు డబ్బు తీసుకుంది శ్రుతి. మొత్తం రూ.11 కోట్లు తీసుకుంది.

odisha govt school teacher 4 Marriages

రూ.11కోట్లు సమర్పించుకున్న వ్యాపారి:
డబ్బు చేతికి అందాక శ్రుతిలో మార్పు వచ్చింది. కొద్ది రోజుల తర్వాత వీరారెడ్డికి అసలు విషయం అర్థమైంది. తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబో మన్నాడు. వెంటనే పోలీసులను అశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కిలాడీ లేడీ శ్రుతి సిన్హాని అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రుతి నుంచి పోలీసులు రూ.6కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.

inter caste marriage

inter caste marriage

శ్రుతి సిన్హా లగ్జరీ లైఫ్ చూసి పోలీసులే కంగుతిన్నారు. మాయ మాటలతో, పెళ్లి పేరుతో ఇంకా ఎంతమందిని మోసం చేసిందో తెలియాల్సి ఉందంటున్నారు. ఆమె చేతిలో మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు.

ఈ కేసులో బాధితుడైన వ్యాపారి వీరారెడ్డి తీరు కూడా చర్చకు దారితీసింది. ఆమెని నమ్మి ఏకంగా 11 కోట్లు ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. అంత డబ్బు పోతే కానీ ఆయనకు కనువిప్పు కలగకపోవడం విడ్డూరంగా ఉందని పోలీసులు అంటున్నారు. ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలు చేసే వారు ఎక్కువైపోయారని, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ముందూ వెనుక ఆలోచన చేయకుండా అపరిచిత వ్యక్తులతో సావాసం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.