T20 World Cup final: ఈ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్తాయి.. టీమిండియా గెలుస్తుంది: ఏబీ డి విలియర్స్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపటి నుంచి సెమీఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. టీమిండియా బలంగా ఉండడంతో ఆ జట్టే కప్ గెలిచే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. తాజాగా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డి విలియర్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్స్ కు న్యూజిలాండ్-భారత్ చేరుకుని తలబడతాయని అనుకుంటున్నాను. భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంటుందని భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మంచి ఫాంలో ఉన్నారు. టీమిండియాలోని అందరికీ గొప్ప నైపుణ్యాలు ఉన్నాయి’’ అని చెప్పారు.

T20 World Cup final: ఈ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్తాయి.. టీమిండియా గెలుస్తుంది: ఏబీ డి విలియర్స్

T20 World Cup final: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపటి నుంచి సెమీఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. టీమిండియా బలంగా ఉండడంతో ఆ జట్టే కప్ గెలిచే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. తాజాగా, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డి విలియర్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్స్ కు న్యూజిలాండ్-భారత్ చేరుకుని తలబడతాయని అనుకుంటున్నాను. భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంటుందని భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మంచి ఫాంలో ఉన్నారు. టీమిండియాలోని అందరికీ గొప్ప నైపుణ్యాలు ఉన్నాయి’’ అని చెప్పారు.

మరోవైపు, టీమిండియా-పాకిస్థాన్ ఫైనల్స్ కు వెళతాయా? అని ఏబీ డి విలియర్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోల్ నిర్వహించారు. అందులో 77.3 శాతం మంది వెళతాయని, 22.7 శాతం మంది వెళ్లబోవని ఓటు వేశారు. రేపు న్యూజిలాండ్ తో పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

ఎల్లుండి ఇంగ్లండ్-భారత్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. పాక్ పై న్యూజిలాండ్, ఇంగ్లండ్ పై టీమిండియా గెలుస్తాయని ఏబీ డి విలియర్స్ అంచనా వేశారు. ఈ ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓడి దక్షిణాఫ్రికా టీమ్ సెమీఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న విషయం తెలిసిందే.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..