T20 world cup 2022: నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి.. సెమీఫైనల్స్‌కు భారత్

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ కు చేరింది. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచులో సౌతాఫ్రికా ఓడిపోయింది. దీంతో గ్రూప్-బీలో భారత్ 6 పాయింటతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో దక్షిణాగెలిస్తే ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు చేరేవి. దక్షిణాఫ్రికాకు ప్రస్తుతం 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే పాక్-బంగ్లాదేశ్ జట్లకు గ్రూప్-బీలో చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇవాళ ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

T20 world cup 2022: నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి.. సెమీఫైనల్స్‌కు భారత్

T20 world cup 2022: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ కు చేరింది. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచులో సౌతాఫ్రికా ఓడిపోయింది. దీంతో గ్రూప్-బీలో భారత్ 6 పాయింటతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు చేరేవి. దక్షిణాఫ్రికాకు ప్రస్తుతం 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే పాక్-బంగ్లాదేశ్ జట్లకు గ్రూప్-బీలో చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

ఇవాళ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ రెండు జట్లలో గెలిచిన జట్టుకు 6 పాయింట్లు వస్తాయి. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో పాక్-బంగ్లాదేశ్ జట్లలో ఏదైనా ఒక జట్టు సెమీఫైనల్ చేరుతుంది. ప్రస్తుతం పాక్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు జింబాబ్వేతో భారత్ తలపడనుంది.

ఈ మ్యాచు వర్షం కారణంగా రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింటు దక్కుతాయి. దీంతో మ్యాచ్ రద్దయితే కూడా భారత్ 7 పాయింట్లతో గ్రూప్-బీలో అగ్రస్థానంలోనే ఉంటుంది. మ్యాచు జరిగి జింబాబ్వేపై గెలిస్తే 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-ఏలో తొలి స్థానంలో న్యూజిలాండ్, రెండో స్థానంలో ఇంగ్లండ్ ఉన్నాయి. దీంతో భారత్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..