India: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
భారత్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొన్న 18,930 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,815 కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
India: భారత్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొన్న 18,930 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,815 కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, అదే సమయంలో కరోనా కారణంగా 38 మంది మృతి చెందారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,22,335 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. 4.96 శాతంగా రోజువారీ పాజిటివిటీ రేటు ఉందని వివరించింది. దేశంలో 0.28 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 4,35,85,554 కరోనా కేసులు, 5,25,343 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. దేశంలో 98.51 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 15,899 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,29,37,876గా ఉందని వివరించింది.