India vs England: సెమీఫైనల్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అలవోకగా ఛేదించింది.  ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ క్రీజులో పాతుకుపోయి టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. వారి జోడీని విడగొట్టడం టీమిండియా బౌలర్లలో ఎవరి వల్లా కాలేదు.

India vs England: సెమీఫైనల్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్

India vs England: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అలవోకగా ఛేదించింది.

ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ క్రీజులో పాతుకుపోయి టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. వారి జోడీని విడగొట్టడం టీమిండియా బౌలర్లలో ఎవరి వల్లా కాలేదు. జోస్ బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులు, అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 86 పరుగులు చేశారు. దీంతో 16 ఓవర్లలోనే ఇంగ్లండ్ 170 పరుగులు చేసింది. భారత బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 5, రోహిత్ శర్మ 27, విరాట్ కోహ్లీ 50, సూర్యకుమార్ యాదవ్ 14, హార్దిక్ పాండ్యా 63, రిషబ్ పంత్ 6 (రనౌట్), రవిచంద్రన్ అశ్విన్ 0(నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ జోర్డాన్ 2, అదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఈ నెల 13న పాకిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసినప్పటికీ ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేయలేకపోయిన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..