IPL 2021 Phase 2 : ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్‌

ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ లో డిఫెండింగ్ చాపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.

IPL 2021 Phase 2 : ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్‌

Ipl

IPL 2021 Schedule : ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ ల నిర్వాహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. భారత్ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమైనా కరోనా దెబ్బకు మ్యాచ్ లు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీంతో లీగ్ ను యూఏఐకి తరలిపోయింది. అక్కడ మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ మ్యాచ్ ల షెడ్యూల్ ను ఆదివారం ప్రకటించింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ మధ్య 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్ లను షెడ్యూల్ చేసింది.

Read More : Pamban Sea Bridge : పంబన్ బ్రిడ్జిని ఢీ కొట్టిన భారీ నౌక

ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ లో డిఫెండింగ్ చాపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. సెప్టెంబర్ 19వ తేదీన ఈ రెండు జట్లు పోటీ పడనుండగా..క్వాలిఫయిర్ 1 మ్యాచ్ అక్టోబర్ 10న, ఎలిమినేటర్ అక్టోబర్ 11న, అక్టోబర్ 13న క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరుగనుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 09వ తేదీన మొదలైన 14వ సీజన్ లో సగం మ్యాచ్ లు పూర్తయ్యే సరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు.

Read More : Tokyo Olympics : ఒలింపిక్ చరిత్రలో తొలిసారి..అన్నాచెల్లెలకు పసిడి పతకాలు

దీంతో మే 04వ తేదీన టోర్నీ నిరవిధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. టోర్నీ వాయిదా పడే సరికి మొత్తం 29 మ్యాచ్ లు అందులో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ లో నిలిచింది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. చెన్నై జట్టు 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి..10 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి..మూడో స్థానంలో నిలిచింది.