Dubai Lottery : మహరాష్ట్ర వాసికి దుబాయ్ లాటరీలో జాక్ పాట్

మిలియనీర్ మిలీనియం సరీస్363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం 0207కు ఈ ఫ్రైజ్ మనీ లభించింది.

Dubai Lottery : మహరాష్ట్ర వాసికి దుబాయ్ లాటరీలో జాక్ పాట్

దుబాయ్ లాటరీలో భారతీయునికి జాక్ పాట్

Dubai Lottery : దుబాయ్ లాటరీల్లో డబ్బు గెలుచుకోవటంలో భారతీయులను అదృష్టదేవత వరిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేరళకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ దుబాయ్ లాటరీలో తన స్నేహితులతో కలసి పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోగా తాజాగా మహరాష్ట్ర వాసికి భారీ లాటరీ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో మహరాష్ట్ర కు చెందిన షిండే 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. మన డబ్బులో అది అక్షరాల 7కోట్ల 45లక్షల రూపాయలు.

మిలియనీర్ మిలీనియం సిరీస్363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం 0207కు ఈ ఫ్రైజ్ మనీ లభించింది. షిండే స్వస్ధలం మహరాష్ట్రలోని థానే. ప్రస్తుతం నావీలో పనిచేస్తున్నాడు. అతని వయస్సు 36 సంవత్సరాలు. 1999లో ప్రారంభమైన మిలియనీర్ మిలీనియం లాటరీని ఇప్పటివరకు 180 మంది భారతీయులు గెలుచుకోగా, షిండే లాటరీని గెలుచుకున్న 181వ వ్యక్తి కావటం విశేషం.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టిక్కెట్లు కొనడంలో సైతం భారతీయులే అధికంగా ఉన్నారు. అధిసంఖ్యలో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి తమ లక్ ను చాలా మంది పరీక్షించుకుంటున్నారు. ఒక మిలియన్ డాలర్ల ఫ్రైజ్ మనీ రావటం పట్ల షిండే ఆనందం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్ధలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.