Jayasudha : ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది.. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు..

జయసుధ మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది. బాలీవుడ్‌లో అయితే అందరూ అభినందిస్తారు, ఫ్లవర్ బోకేలు పంపిస్తారు. ఇక్కడ ఫ్లవర్ బోకేలు ఇచ్చిన వాళ్లు కూడా లేరు. అదే హీరో అయితే...........

Jayasudha : ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది.. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు..

Jayasudha

Jayasudha :  ఒకప్పటి స్టార్ హీరోయిన్, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో మెప్పించారు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు ఎంతో మంది సరసన హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్త పాత్రలతో అలరిస్తున్నారు. మధ్యలో కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చినా ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల ఆమె సినీ పరిశ్రమకి వచ్చి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. నటిగానే కాక నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా రాణించారు. జయసుధ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

జయసుధ మాట్లాడుతూ.. ”నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది. బాలీవుడ్‌లో అయితే అందరూ అభినందిస్తారు, ఫ్లవర్ బోకేలు పంపిస్తారు. ఇక్కడ ఫ్లవర్ బోకేలు ఇచ్చిన వాళ్లు కూడా లేరు. అదే హీరో అయితే చాలా హడావుడి చేసేవాళ్ళు. 50 ఏళ్ళు అయినందుకు పెద్ద పార్టీ ఇవ్వమని కొంతమంది చెప్పారు. కానీ నాకు అది నచ్చలేదు. ఇండస్ట్రీలో హీరోలను ఒకలాగా, హీరోయిన్స్‌ను ఒకలాగా చూస్తారు. హీరోల కంటే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళే ఎక్కువ హడావిడి చేస్తారు. హీరోలు డ్యాన్సులు సరిగ్గా చేయకపోయినా మమ్మల్నే అనేవాళ్ళు. ఇక ఇక్కడి హీరోయిన్స్ ని, ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్‌ను ఒకలా ట్రీట్ చేస్తారు. వాళ్ల కుక్క పిల్లకు కూడా రూమ్ ఇస్తారు. మనల్ని మాత్రం పట్టించుకోరు. నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా, డిమాండ్ చేసినా ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండేదాన్ని కాదు.”

Fan Died in Event : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమాని మృతి

”సినీ ఇండస్ట్రీలో నేను డబ్బు ఎలా కూడబెట్టుకోవాలో నేర్చుకోలేకపోయాను. మా ఎన్నికలు జరిగే సమయంలో ఆ గోల భరించలేక అమెరికాకు వెళ్ళిపోయాను. అదో పెద్ద కథ. మా అసోసియేషన్ బిల్డింగ్ కడతామని మురళీ మోహన్ గారి టైమ్ నుంచి చెబుతున్నారు. ఇంకో పాతికేళ్ళు ఉన్నా అది పూర్తవుతుందని నమ్మకం నాకు లేదు. నాకు పద్మశ్రీ రాలేదని చాలా మంది అడిగారు. కంగాన రనౌత్‌కు ఇప్పించారు. నాకు ఎందుకు రాలేదో నాకు కూడా తెలీదు” అని చాలా విషయాలు ఇలా ఓపెన్ గా చెప్పారు. దీంతో జయసుధ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.