అభిమానులకు ఏరోజూ నేను చెప్పలేదు.. వాళ్లు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా..: ఎన్టీఆర్

అభిమానులకు ఏరోజూ నేను చెప్పలేదు.. వాళ్లు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా..: ఎన్టీఆర్

Team Tarak Trust

సామాన్యులను గెలిపించడం కోసమే.. అంటూ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ద్వారా మరోసారి తెలుగు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న తారక్.. ప్రోగ్రామ్ గురించిన వివరాలు వెల్లడిస్తూ మీడియా మీట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా సోషల్ మీడియా ద్వారా టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తున్న సేవలపై విలేఖరి ప్రశ్నించగా.. అటువంటి కార్యక్రమాలు తనకు ఎంతో సంతోషం కలిగిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.

ప్రతి ఊరిలో టీమ్ తారక్ ట్రస్ట్ చేస్తోన్న సేవల గురించి మాట్లాడుతూ.. నేను అభిమానులకు చేసేదానికంటే.. అభిమానులు నాకు చెయ్యడం చాలా ఎక్కువే అవుతోందని, నేను ఏరోజూ ఇలా చేస్తుంటే బాగుంటుంది అనలేదు.. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్లు అనుకుని చెయ్యడం వల్ల వచ్చిన మహోన్నతమైన కార్యక్రమం ఇది.. అంటూ తన అభిమానులను చేస్తోన్న కార్యక్రమాలను ప్రశంసించారు.

మనుషులుగా సేవ చేస్తే కచ్చితంగా నాకు సంతోషంగానే ఉంటుంది.. అమ్మకు ఎంత చేసినా సరిపోతు.. భార్యకు ఎంత చేసినా సరిపోదు.. అభిమానులకు ఎంత చేసినా సరిపోదు.. కానీ ప్రతి అభిమాని కాలర్ ఎగరేసేలా కచ్చితంగా చేస్తా అని అన్నారు. అభిమానులను కాలర్ ఎగరేసుకునే లెవెల్‌లో మాత్రం కచ్చితంగా చేస్తాను.. అని, అభిమానుల నమ్మకాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఒమ్ము చేయబోనని చెప్పుకొచ్చారు.

ఇక ఇదే సమయంలో తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా లేనని.. కానీ నా అభిమానులు కోరుకునేది ఏమిటి అనేదానిపై మాత్రం కచ్చితంగా తెలుసుకుంటూ ఉంటానని అన్నారు.