Justice N.V.Ramana: నేడు తిరుపతితో సుప్రీంకోర్టు సీజే ఎన్.వి.రమణ పర్యటన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు.

Justice N.V.Ramana: నేడు తిరుపతితో సుప్రీంకోర్టు సీజే ఎన్.వి.రమణ పర్యటన

Justice Nv Ramana

Justice N.V.Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులకు సంబంధించి ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు. సాధారణ కోర్టుల్లో ఎర్ర చందనం కేసులు త్వరితగతిన పరిష్కారం కావడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు కేసులను త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. కోర్టుల ప్రారంభం తర్వాత ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించే సభలో తిరుపతి జిల్లా పరిధిలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులను ఉద్దేశించి రమణ ప్రసంగిస్తారు.

Lawrence Bishnoi: సిద్ధూ హత్య.. లారెన్స్ బిష్ణోయే సూత్రధారి

అనంతరం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పురస్కారాలు అందజేస్తారు. సీజే పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.