CJI UU Lalit : భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ UU Lalit

భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించారు. జస్టియ్‌ యూయూ లలిత్‌ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. అంటే 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.

CJI UU Lalit : భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ UU Lalit

Justice UU Lalit takes oath as 49th Chief Justice of India.

CJI UU Lalit : భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ (UU Lalit)ప్రమాణస్వీకారం చేశారు. శనివారం (ఆగస్టు 27,2022) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించారు. జస్టియ్‌ యూయూ లలిత్‌ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. అంటే 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో యూయూ లలిత్ సీజేఐగా నియమితులయ్యారు. నవంబర్ 8న లలిత పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా మాట్లాడిన జస్టిస్‌ లలిత్‌.. దేశంలోని కేసుల జాబితా, అత్యవసర వ్యవహారాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలు అనే మూడు ప్రధాన అంశాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. గతంలో పలు కీలక తీర్పులో జస్టిస్ యూయూ లలిత్ వెల్లడించారు. ఉదయ్ యు లలిత్ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు . అతని తాత, రంగనాథ్ లలిత్ కూడా మహాత్మా గాంధీ,జవహర్‌లాల్ నెహ్రూ షోలాపూర్ సందర్శించినప్పుడు రెండు వేర్వేరు పౌర రిసెప్షన్‌లకు అధ్యక్షత వహించిన న్యాయవాది.

జస్టిస్ యూయూ లలిత నేపథ్యం..
ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.
న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది.
సుప్రీంకోర్టుకు నేరుగా పరదోన్నతి పొంది సీజేఐ అయినా రెండో వ్యక్తి లలిత్..
2014 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టు జడ్జ్..
1983 నుంచి 1985 వరకు బాంబే హైకోర్టు లాయర్