K.A.Paul: అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: కేఏ పాల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

K.A.Paul: అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: కేఏ పాల్

K.a.paul

K.A.Paul: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరూ బలికాలేదు. అమరవీరుల కుటుంబాలను ప్రజా శాంతి పార్టీ తరఫున ఆదుకుంటాం. 1200 కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.

PM Modi: “కిచిడీ వండటం మోదీనే నేర్పించారు”

మా పార్టీ అమరవీరుల కుటుంబాల కోసం పోరాటం చేస్తుంది. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంతాచారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతాం. శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలి’’ అని కేఏ పాల్ డిమాండ్ చేశారు.