Kalamma Thalli Chedhodu : ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం ద్వారా సినీ వర్కర్లకు చేయూత..

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవి చంద్ ఆధ్వర్యంలో ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది..

Kalamma Thalli Chedhodu : ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం ద్వారా సినీ వర్కర్లకు చేయూత..

Kalamma Thalli Chedhodu

Kalamma Thalli Chedhodu: ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవి చంద్ ఆధ్వర్యంలో ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్‌కి, డ్రైవర్స్‌కి, జూనియర్ ఆర్టిస్టులు మరియు ప్రొడక్షన్ వర్కర్స్‌కి సుమారు ఆరువందల మందికి ఫుడ్ గ్రోసెరిస్ ఇవ్వడం జరిగింది.

దాదాపు నెలకు సరిపడా నిత్యావసర సామాగ్రి అయిన రైస్ బ్యాగ్, కంది పప్పు, రెండు ఆయిల్ ప్యాకెట్స్, గోధుమ పిండి, మినప గుండ్లు, పంచదార, ఎండుమిర్చి, గోధుమ రవ్వ, టీ పౌడర్, పసుపు, పెసర పప్పు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, చింత పండు, రిన్ సోప్‌లు, విమ్ బార్‌లు, కోల్గేట్ పేస్ట్, జీరా, ఆవాలు.. ఇలా అన్నీ రెండు కిలోలు చొప్పున జి మార్ట్ సూపర్ మార్కెట్ ద్వారా ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత కష్ట కాలంలో ప్రతి పేద సినిమా కార్మికుడు, కార్మికురాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరినీ ఆదుకోవాలని ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ వున్నారు. ఇప్పుడు వారందరికీ ఓకే సారి గ్రోసెరీస్ పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి కోవిడ్ కారణాల దృష్టా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మందికి పేద కార్మికులకు మొదటి విడతగా ఫుడ్ గ్రోసెరీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా దశల వారిగా ఫుడ్ గ్రాసరీస్ అందజేయడం జరుగుతుంది.

చాలా మంది పెద్దలు సినీ పేద కార్మికులకు సర్వీస్ చేయాలని వారికి మీరు సాయం చెయ్యమని మాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వారి నుండి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు చేసే సహాయాన్ని మేము సెలెక్ట్ చేసుకొన్న సూపర్ మార్కెట్‌‌కు పే చెయ్యమని సూచించడం జరిగింది. ఆ సూపర్ మార్కెట్ ద్వారా 2500 రూపాయల విలువ కలిగిన నెలకు సరిపడా ఫుడ్ గ్రోసెరీస్‌ను అందజేశాము. అలాగే కరోనా ఉన్నంత వరకు ప్రతి పేద సినీ కార్మికుడికీ మేము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాం. సినీ వర్కర్స్‌కు సహాయం చేసే విషయంలో నేను దిల్ రాజు గారు దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఒక్క మాట కూడా అడగకుండా ఒకే చెయ్యి, ఏమి కావాలి అన్నా నా సపోర్ట్ ఉంటుంది అని ముందుకు వచ్చినందుకు నా ధన్యవాదాలు, అలాగే చదల వాడ శ్రీనివాసరావు గారు నేను అడగగానే ముందుకు వచ్చారు వారికీ నా ధన్య వాదములు తెలియచేస్తున్నాను’’ అన్నారు.

అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘కరోనా కష్ట కాలంలో యలమంచిలి రవిచంద్ పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్లందరికి తనవంతు సాయంగా ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘యలమంచిలి రవి చంద్ గారు ఈ కష్ట కాలంలో పేదలకి ఇలాంటి సాయం చేస్తున్నందుకు నా అభినందనలు తెలుపుతున్నాను’’ అన్నారు.
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ కరోనా కష్ట కాలంలో మొట్టమొదటిగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసి, పేదలకు సాయం చేసినందుకు యలమంచిలి రవి చంద్ గారికి, దిల్ రాజు గారికి, చదలవాడ శ్రీనివాసరావు రావు గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నారు.