హీరో సుశాంత్‌ది ప్లాన్డ్ మర్డర్, హంతకులు వాళ్లే, హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 03:45 AM IST
హీరో సుశాంత్‌ది ప్లాన్డ్ మర్డర్, హంతకులు వాళ్లే, హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్రంగా కలత చెందారు. ఎంతో భవిష్యత్తున్న నటుడు అర్థాంతరంగా తనువు చాలించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సుశాంత్ మరణం చుట్టూ వివాదం నడుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా సుశాంత్ ది ఆత్మహత్యే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని కొందరు అంటున్నారు. సుశాంత్ ది ప్లాన్డ్ మర్డర్ అని, దీని వెనుక కుట్ర ఉందని చెబుతున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీనిపై తనకు అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని ఇప్పటికే సుశాంత్ మేనమామ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

సుశాంత్‌ని బాలీవుడ్ పెద్దలే హత్య చేశారు:
తాజాగా హీరోయిన్ కంగనా రనౌత్ సుశాంత్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్ళను ఎదగనివ్వరని ఆమె మండిపడ్డారు. బాలీవుడ్ మాఫియా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారు:
సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది. కానీ అవార్డు రానివ్వకుండా కొందరు పెద్దలు వెనుక తతంగం నడిపించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి? స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు? అంటూ సుశాంత్ మృతిపై సంచలన కామెంట్స్ చేశారు కంగనా రనౌత్. ట్విట్టర్ ద్వారా సుమారు 2 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసిన కంగనా.. అందులో బాలీవుడ్‌ పెద్దలే సుశాంత్ మరణానికి కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

వారి టార్చర్ భరించలేకే:
‘‘బాలీవుడ్‌లో కొత్తగా వచ్చేవారికి సపోర్ట్ చేయడం సంగతి పక్కన పెడితే వారు ఎదగకుండా కొందరు బాలీవుడ్ పెద్దలు తెరవెనుక ప్లాన్స్ చేస్తుంటారు. కొత్తగా వచ్చి సక్సెస్ అవుతున్నారని గమనిస్తే చాలు వారి సినిమాలకు రివ్యూస్ చెత్తగా ఉందని రాయించడం మొదలుకుని చాలా ప్రయోగాలు చేస్తారు. సుశాంత్ విషయానికి వస్తే.. అతనొక డ్రగ్ బానిస అని చిత్రీకరించడానికి కూడా కొందరు స్కెచ్‌లు వేశారు. తన సినిమాలు ఆడకపోతే తనని ఇండస్ట్రీలో ఉండనీయరని ఒకానొక సమయంలో సుశాంత్ తన సినిమాలు చూడండి అని అభిమానులకు విజ్ఞప్తి చేసే స్థాయికి తీసుకొచ్చారు. అతని మాటలను బట్టి చూస్తే.. అతని ఆత్మహత్యకు కారణం బాలీవుడ్ పెద్దలే. వారు పెట్టిన టార్చర్ వల్లే సుశాంత్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు..’’ అని కంగనా అన్నారు. ఇండస్ట్రీని ఉద్దేశించి, బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. కంగనా ఆరోపణలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న గుతాధిపత్యం మరోసారి బయటపడినట్టు అయ్యింది.