11 RSS Workers To RI for Life : నారాయణన్ హత్య కేసులో 11 మంది RSS కార్యకర్తలకు జీవిత ఖైదు

 దాదాపు 10 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన హత్యకేసులో 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను దోషులుగా తేల్చిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. 2013 నాటి హత్యకేసులో కోర్టు 11మంది ఆరెస్సెస్ కార్యకర్తలకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

11 RSS Workers To RI for Life : నారాయణన్ హత్య కేసులో 11 మంది RSS కార్యకర్తలకు జీవిత ఖైదు

11 RSS workers to RI for life for Narayanan Nairs murder Case

11 RSS workers to RI for life for Narayanan Nairs murder Case : దాదాపు 10 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన హత్యకేసులో 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను దోషులుగా తేల్చిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. 2013 నాటి కేసులో ఎట్టకేలకు సెషన్స్ కోర్టు 11మంది ఆరెస్సెస్ కార్యకర్తలకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తిరువనంతపురంలోని అనవూర్‌‌కు చెందిన నారాయణన్ నాయర్ కుమారుడు శివప్రసాద్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ప్రాంతీయ కార్యదర్శిగా ఉండేవారు.

శివప్రసాద్ ను హత్య చేయాలనే ఉద్ధేశంతో వారి ఇంటిపై దాడికి దిగి అత్యంత అమానవీయ అకృత్యానికి పాల్పడ్డారు ఆరెస్సెస్ కార్యకర్తలు. 2013లో నవంబరు 5న మారణాయుధాలతో నారాయణన్ ఇంట్లోకి చొరబడ్డారు. వారిని నారాయణన్ అడ్డుకున్నారు. దీంతో అరెస్సెస్ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. మనుషులనే మాటే మర్చిపోయినట్లున్నారు. అంత్యంత దారుణంగా నారాయణణ్ భార్య, ఇద్దరు కుమారుల కళ్లెదుటే ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో శివప్రసాద్, ఆయన సోదరుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రాజకీయపరమైన గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. విచారణ సమయంలో నిందితులందరూ ఒకే రకమైన దుస్తులు, హెయిర్ స్టైల్‌తో వచ్చి సాక్షులను తప్పదోవ పట్టించాలని చూసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ కేసు అప్పటినుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంతో తాజాగా నెయ్యట్టిన్‌కర అడిషనల్ సెషన్స్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. దోషుల్లో కేరళ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి వెల్లమ్‌కొల్ల రాజేశ్ (47), ఆరెస్సెస్ ప్రచారక్ అనిల్ (32), ప్రసాద్ కుమార్,గిరీష్ కుమార్, ప్రేమ్ కుమార్, అరుణ్ కుమారార్ అలియాస్ అంతప్పన్, బైజు,అజయన్ అలియాస్ ఉన్ని, సాజికుమార్,బిను కుమార్ సహా అందరూ ఆరెస్సెస్ కార్యకర్తలే కావడం గమనించాల్సిన విషయం.