Kerosene : హీరోనే దర్శకుడిగా తెరకెక్కిన కిరోసిన్.. సెన్సార్ పూర్తి.. విరాటపర్వంకి పోటీగా రిలీజ్..

డిఫరెంట్ ఐడియాలతో సరికొత్త కథలను తీసుకొని సినిమాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్..................

Kerosene : హీరోనే దర్శకుడిగా తెరకెక్కిన కిరోసిన్.. సెన్సార్ పూర్తి.. విరాటపర్వంకి పోటీగా రిలీజ్..

Kerosene

Kerosene :  డిఫరెంట్ ఐడియాలతో సరికొత్త కథలను తీసుకొని సినిమాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ధృవ. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.

బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కాగా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..

ఇటీవల చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 17న రిలీజ్ కాబోతుంది.