Kia Carnival : కార్నివాల్ కారుపై బంపర్ క్యాష్ డిస్కౌంట్ ప్రకటించిన కియా..

ఎస్ యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్ లలో ఈ కారును మార్కెట్లో అందిబాటు ఉంది. 200హెచ్ పీ పవర్ శక్తిని కలిగి గరిష్టంగా 440 టార్కును ఉత్పత్తి చేస్తుంది.

Kia Carnival : కార్నివాల్ కారుపై బంపర్ క్యాష్ డిస్కౌంట్ ప్రకటించిన కియా..

Kia

Kia Carnival : భారత్ లో అమ్మకాలు పెంచుకోవటంపై దృష్టిసారించింది దక్షిణకొరియా ఆటో మొబైల్ దిగ్గజం కియా.. ఇందుకు గాను కొనుగోళ్ళపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా కియా కార్నివాల్ ఎంపీవీ కారు కొనుగోలు పై 2.50లక్షల క్యాష్ డిస్కౌంట్ ప్రకటించింది. దీనితోపాటు వార్షిక నిర్వాహణ ఖర్చులు , వారంటీ ప్యాకేజీ ఇతర ఖర్చులు కలిపి 1.25వేల రూపాయలను కొనుగోలు దారుడు అదా చేసుకోవచ్చు.

ప్రస్తుతం కియా కార్నివాల్ ఎంపీవీ కారు ధర 24.95లక్షల రూపాయలుగా షోరూమ్ ధర ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్ పోతో 21.20లక్షలకే సొంతం చేసుకునేందుకు అవకాశం దక్కనుంది. 2020లో జరిగిన ఆటో ఎక్స్ పోలో కియా కార్నివాల్ కారును ఇండియన్ మార్కెట్ లోకి కియా విడుదల చేసింది. నాలుగు వరుసల్లో తొమ్మిది సీట్లు కలిగి ఉండటం ఈ కారు స్పెషాలిటీ.

ఎస్ యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం, లిమోసిన్ అనే మూడు ట్రిమ్ లలో ఈ కారును మార్కెట్లో అందిబాటు ఉంది. 200హెచ్ పీ పవర్ శక్తిని కలిగి గరిష్టంగా 440 టార్కును ఉత్పత్తి చేస్తుంది. క్యాబిన్ లో అత్యాధుని టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్, కారులోపలి బాగంలో నప్పా లెదర్ అప్ హోల్ స్టరీతో డిజైనింగ్ ప్రత్యేక అకర్షణగా నిలుస్తోంది.

కష్టమర్లను ఇట్టే ఆకట్టుకోగలిగేలా ఉన్న ఈ కారును కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మరింత ఆసక్తి చూపేలా కియా సంస్ధ సరికొత్త ఆపర్లను, డిస్కౌంట్లను ప్రకటించింది. తద్వారా అమ్మకాలు భారీగా పెరుగుతాయన్న అంచనాల్లో సంస్ధ ఉంది. కంపెనీ ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లతో కొనుగోలు దారునికి ఏకంగా3.75లక్షల బంపర్ క్యాష్ డిస్కౌంట్ లభించనుంది.