National
చనిపోయిన భర్త స్పెర్మ్ పై భార్యకే సర్వహక్కులు: హైకోర్టు సంచలన తీర్పు..!!
Updated On - 4:44 pm, Fri, 22 January 21

kolkata HC Only widow of a dead man has the right to his sperm: చనిపోయిన భర్త వీర్యంపై హక్కు ఎవరికి ఉంటుంది? అనే కీలక విషయంపై కోల్కతా హైకోర్టు పెను సంచలన తీర్పునిచ్చింది..! చనిపోయిన వ్యక్తి దాచి పెట్టిన వీర్యం (semen)పై హక్కు విషయంపై దాఖలైన పిటీషన్ పై కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చనిపోయిన భర్త వీర్యంపై పూర్తి హక్కులు వితంతువైన భార్యకే ఉంటాయని కీలక తీర్పునిచ్చింది..!!
చనిపోయిన ఓ వ్యక్తి వీర్యం కోసం దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. 2020 మార్చిలో ఓ తండ్రి.. ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో దాచిన చనిపోయిన కుమారుడి తాలూకూ వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం పలు విధాలుగా కేసును విచారించింది. ఆ వీర్యం నిరుపయోగమైతే తమ వంశం నాశనం అవుతుందని..ఇక ఇక్కడితే తమ వంశం అంతరించిపోతుందని పిటిషన్లో పేర్కొన్నాడు.
ఈ పిటీషన్ పై జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య జనవరి 19న దీనిపై విచారణ చేపట్టారు. ‘‘తండ్రీ కొడుకుల సంబంధం ఉన్నంత మాత్రాన పిటిషనర్ (చనిపోయిన వ్యక్తి తండ్రి) వీర్యాన్ని పొందటానికి ఎటువంటి ప్రాథమిక హక్కులను కలిగిఉండలేరనీ..చనిపోయిన వ్యక్తి వీర్యం కేవలం అతడి భార్యకు మాత్రమే సొంతం. ఆమెకు మాత్రమే దానిపై పూర్తి హక్కులు ఉంటాయనీ..తీర్పునిచ్చారు. ఈ విషయంలో కోర్టు ఆమెను ఏ విధంగానూ ఆదేశించలేదని స్పష్టంచేశారు.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి..కోల్కతాకు చెందిన పిటిషన్ దారుడి కొడుకు తలసేమియాతో బాధపడేవాడు. ఢిల్లీ హాస్పిటల్లో దీనికిసంబంధించి ట్రీట్ మెంట్ కూడా తీసుకునేవాడు. 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి 2018లో అతడు మృతి చెందాడు.
కానీ..అతను మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని దాచి ఉంచారు. ఈక్రమంలో స్పెర్మ్ బ్యాంకులోని తమ కుమారుడి వీర్యాన్ని రెండేళ్ల ఒప్పందకాలం ముగిసేవరకు భద్రంగా ఉంచాలని తల్లిదండ్రులు సదరు స్మెర్మ్ బ్యాంకుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పెర్మ్ బ్యాంక్.. వీర్యాన్ని అతడి భార్య గర్బం దాల్చడానికి ఉపయోగించాలన్నా.. లేక, వేరే వాళ్ల కోసం ఉపయోగించాలని అనుకున్నా..లేదా దాన్ని నిరుపయోగంగా పడేయాలన్నా అది కేవలం భార్య అనుమతితోనే సాధ్యమవుతుందని స్పష్టంచేసింది.
దీంతో వారు తమ కోడల్ని వీర్యం విషయమై నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వవల్సిందిగా కోరారు. దీనికి ఆమె అంగీకరించలేదు. అత్తమామల అభిప్రాయాన్ని తిరస్కరించింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. తమ కోడలు తమ కొడుకు వీర్యాన్ని తమకు కాకుండా చేస్తోందంటూ కోర్టులో పిటీషన్ వేయగా..సదరు మరణించిన వ్యక్తి భార్యకే ఆ వీర్యంపై సర్వ హక్కులు ఉంటాయని పశ్చిమబెంగాల్ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం అయిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
You may like
-
అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి
-
కోల్ కతాలో మోడీ, మమత, బీజేపీ, టీఎంసీల స్వీట్లు
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ సర్కారు సై
-
చంద్రబాబు రోడ్షోను అడ్డుకున్న న్యాయవాదులు..కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలపాలని డిమాండ్
-
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్..అధికారుల నియంత్రణ కొరవడిందని వ్యాఖ్య
-
మున్సిపల్ ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని హైకోర్టు ఆదేశాలు

‘మహా సముద్రం’ లో మాస్ లుక్లో శర్వానంద్…

బీజేపీ లీడర్లు ఎన్నికల్లో గెలవాలంటే రైతుల ఆందోళనలో పాల్గొనండి

జగన్కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసి…. మూగ బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసిన మైనర్ యువకుడు

శర్వా బర్త్డే సెలబ్రేట్ చేసిన చెర్రీ

యవ్వనంతో 180 ఏళ్లు బతకాలని ఆశ..రూ.130 కోట్లు ఖర్చు పెట్టి..ఆరు నెలలకు ఓసారి ఏం చేస్తున్నాడంటే..

ప్రపంచంలోనే ఖరీదైన పంట.. బీహార్లో సాగులో ఉంది.. కిలో రూ.లక్ష

బద్దకస్తుల బుర్రకు పదునెక్కువ అంటోన్న సైన్స్

ఇండియాలో బిట్ కాయిన్పై ఇన్వెస్ట్ చేయడం తెలుసా? ప్రాసెస్ ఇదిగో

ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ వండింది

జగన్కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం

ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే దిగ్బంధం

చైనా జిత్తులమారి వేషాలు.. భారత్ను దెబ్బకొట్టడమే వ్యూహమా ?

డెస్క్టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్
