Adipurush : ఆదిపురుష్ పై మాట్లాడిన కృతి.. సినిమాలో చెప్పాల్సింది చాలా ఉంది.. మీరు చూసింది టీజర్ మాత్రమే..

తాజాగా ఆదిపురుష్ లో సీతగా నటించిన కృతి సనన్ తన కొత్త సినిమా తోడేలు ప్రమోషన్స్ కి హైదరాబాద్ కి వచ్చింది. ఈ ప్రమోషన్స్ లో కృతి ఆదిపురుష్ గురించి మాట్లాడింది. ఓ విలేఖరి ఆదిపురుష్ గురించి అడగగా కృతి మాట్లాడుతూ.............

Adipurush : ఆదిపురుష్ పై మాట్లాడిన కృతి.. సినిమాలో చెప్పాల్సింది చాలా ఉంది.. మీరు చూసింది టీజర్ మాత్రమే..

Kriti Sanon talks about Adipurush movie

Adipurush :  ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకోవడంతో సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా అది చూసిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది, అసలు ఇందులో రామాయణం ఎక్కడుంది, రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు, అసలు ఇది రామాయణం ఏంటి అంటూ విపరీతంగా విమర్శలు వచ్చాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ టీజర్ ని ట్రోల్ చేశారు. దీంతో సంక్రాంతికి వస్తుందనుకున్న ఆదిపురుష్ సినిమాని జూన్ కి వాయిదా వేసి చిత్రయూనిట్ మళ్ళీ గ్రాఫిక్స్ సరిదిద్దే పనిలో పడ్డారు.

Ragini Dwivedi : షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్.. శరీరం తట్టుకోగలదు కానీ మనసే.. అంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా ఆదిపురుష్ లో సీతగా నటించిన కృతి సనన్ తన కొత్త సినిమా తోడేలు ప్రమోషన్స్ కి హైదరాబాద్ కి వచ్చింది. ఈ ప్రమోషన్స్ లో కృతి ఆదిపురుష్ గురించి మాట్లాడింది. ఓ విలేఖరి ఆదిపురుష్ గురించి అడగగా కృతి మాట్లాడుతూ.. ”ఆదిపురుష్ సినిమాలో చెప్పాల్సింది చాలా ఉంది. మన చరిత్రని అద్భుతంగా చూపించబోతున్నారు ఓం రౌత్. ఈ సినిమాలో మేము నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. మీరు చూసింది కేవలం 30 సెకన్ల టీజర్ మాత్రమే. ఈ సినిమాని ఇంకా తీర్చిదిద్దుతున్నారు. అందుకు టైం పడుతుంది” అని తెలిపింది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎంత మెప్పిస్తుందో చూడాలి.