తెల్లారితే ముహూర్తం. పెళ్లికొడుకు పరార్, పీటలపై కూర్చున్నకొత్త వరుడు

తెల్లారితే ముహూర్తం. పెళ్లికొడుకు పరార్, పీటలపై కూర్చున్నకొత్త వరుడు

love affair, bride groom abscond from venue in karnataka : తెల్లారితే పెళ్లి జరుగుతుంది. ముందురోజ రాత్రి అందరూ హ్యాపీగా విందులో పాల్గోన్నారు. కానీ అర్ధరాత్రి సమయంలో పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. అయితే పెళ్లికి వచ్చిన వేరే యువకుడు ఆయువతి మెడలో తాళి కట్టాడు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని వధువు పీటలమీదనుంచిలేచి వెళ్లిపోతే పెళ్లికి వచ్చిన వేరే యువతి వరుడితోతాళి కట్టించుకుంది. కర్ణాటకలో జరిగినఈ ఘటనలో వరుడు పారిపోయాడు.

వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని చిక్ మగ్ ళూరులోని తారికారే తాలూకాలో సింధు, నవీన్ అనే జంటకు పెద్దలు పెళ్లి కుదిర్చి, ముహూర్తం నిర్ణయించారు. ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి. తెల్లారితే ముహూర్తం. అయితే నవీన్ అప్పటికే వేరే యువతితో ప్రేమలో ఉన్నాడు. తనను కాకుండా మరో యువతిని నవీన్ పెళ్లిచేసుకుంటున్నాడని తెలిసిన ప్రియురాలు, పెళ్లి ఆపేస్తానని హెచ్చరించింది.

దీంతో భయపడిన నవీన్ పెళ్లికి కొద్ది గంటల ముందు కళ్యాణ మండపం నుంచి పరారయ్యాడు. తెల్లారితే కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన నవ వధువు తీవ్ర నిరాశకు గుర్యయింది. సింధు జీవితం ఏమవుతుందో అని అందరూ ఆందోళన చెందారు. అయితే వారి బాధను అర్ధం చేసుకున్న పెళ్లికి వచ్చిన చంద్రు అనే వ్యక్తి సింధును పెళ్లి చేసుకోటానికి సిధ్ధపడ్డాడు. చంద్రు కండక్టర్ గా పని చేస్తున్నాడు. పెద్దలు వారిద్దరికీ విహాహం జరిపించారు.