లాక్ డౌన్ వేళలో..అక్రమ సంబంధాలు : వనపర్తిలో యువకుడి గొంతు కోసిన మహిళ

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 07:47 AM IST
లాక్ డౌన్ వేళలో..అక్రమ సంబంధాలు : వనపర్తిలో యువకుడి గొంతు కోసిన మహిళ

సభ్య సమాజం తల దించుకొనేలా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా…అక్రమ సంబంధాలతో హత్యలకు తెగబడుతున్నారు. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణం..దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణలో 2020, మే 29 వరకు లాక్ డౌన్ విధించింది సీఎం కేసీఆర్. ఈ వేళల్లో కూడా అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ యువకుడిని గొంతు కోసి చంపేసింది మహిళ. 

అచ్చంపేట మండలంలోని మన్ననూర్ కు చెందిన బుడగజంగం ఆంజనేయులు (22)కు …అదే గ్రామానికి చెందిన బాలమ్మ మహిళతో అక్రమ సంబంధం కొనసాగుతుండేది. రెండు సంవత్సరాలుగా ఈ తతంగాన్ని ఎవరికి తెలియకుండా..కొనసాగిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఆంజనేయుల తల్లి, మామలను ఇద్దరిని పిలిపించారు గ్రామ పెద్దలు. ఇది మంచి పద్ధతి కాదని, కుమారుడికి చెప్పాలని మందలించారు. 

ఇంటి పరువు పోతోందనే ఉద్దేశ్యంతో మామ శ్రీనివాసులు కుమార్తెతో ఆంజనేయులికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ విషయాన్ని 2020, మే 05వ తేదీన బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఆగ్రహంతో..కత్తితో ఆంజనేయులి గొంతు కోసింది. అనంతరం గోనె సంచిలో మృతదేహాన్ని చుట్టి డ్రైనేలో పడేసి..ఏమి ఎరుగనట్టు నటించింది.

కుమారుడు కనిపించకపోవడంతో తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2020, మే 08వ తేదీ మన్ననూర్ ఎస్ బీఐ ఎదుట..ఉన్న కల్వర్టు నుంచి దుర్వాసన రావడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. గోనె సంచిలో ఉన్న మృతదేహం ఆంజనేయులుగా గుర్తించారు. పోలీసులు జరిపిన విచారణలో హత్య చేసినట్లు బాలమ్మ ఒప్పుకుందని సీఐ బీసన్న వెల్లడించారు. మొత్తానికి ఓ అక్రమ సంబంధం యువకుడి ప్రాణాలు తీసింది. 

Read More:

భార్య గుడ్డుకూర వండలేదని కన్నకొడుకుని చంపేసిన తండ్రి

* తమ్ముడితో అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది