MAA: విష్ణు ఇచ్చిన హామీల్లో ఒకటి తీరింది.. నెక్స్ట్ ఏంటి..?

మంచు విష్ణు... టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా'లో మహిళల భద్రత కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

MAA: విష్ణు ఇచ్చిన హామీల్లో ఒకటి తీరింది.. నెక్స్ట్ ఏంటి..?

Vishnu

మంచు విష్ణు… టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. MAA ఎన్నికల ప్రచారం సందర్భంగా.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ‘మా’లో మహిళల భద్రత కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ పేరుతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్.. ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

విమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ కమిటీ ఏర్పాటుపై గర్వంగా ఉందని విష్ణు చెప్పారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని.. వారి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ట్వీట్ తో.. విష్ణు సస్పెన్స్ కు తెర దించారు. గుడ్ న్యూస్ చెబుతానంటూ ముందు రోజు ట్వీట్ చేసి.. అందుకు తగ్గట్టే తన నిర్ణయాన్ని ప్రకటించారు.

విష్ణు ఇచ్చిన హామీల్లో.. మరిన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. MAA కు శాశ్వత భవనం. అది కూడా.. తను గెలిస్తే సొంత డబ్బు ఖర్చు పెట్టి నిర్మిస్తానని విష్ణు చెప్పారు. 2, 3 స్థలాలు కూడా చూస్తున్నట్టు చెప్పారు. అలాగే.. నటీనటులకు అవకాశాలు, MAA సభ్యుల పిల్లలకు స్కాలర్ షిప్పులు, మెరుగైన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇళ్లు లేని సభ్యులకు సొంతింటి కల తీర్చే ప్రణాళిక.. ఇలా చెబుతూ పోతే చాలా హామీలే ఉన్నాయి.

ఆ హామీలు అన్నిటినీ కచ్చితంగా అమలు చేస్తామని విష్ణు వీలు కుదిరినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే.. విమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన తర్వాత నిర్ణయం ఎలా ఉంటుందన్నది.. ఆసక్తికరంగా మారింది.

Read More:

Bigg Boss 5 : బిగ్ బాస్ లో నా ఫ్రెండ్ కే ఓటు వేయండి అంటున్న ఆర్ఎక్స్100 భామ