Accid attack on Man : యువకుడిపై యాసిడ్ పోసి..కదిలే రైల్లోంచి దూకేసిన మహిళ
యువకుడిపై యాసిడ్ పోసి..కదిలే రైల్లోంచి దూకేసింది ఓ మహిళ. రైల్లో జరిగిన ఈ యాసిడ్ దాడి వల్ల బోగీలో కూడా మంటలు చెలరేగటంతో..కొంతమంది ప్రయాణీకులు రైల్లోంచి దూకేయటంతో తీవ్ర గాయాలయ్యాయ
Accid attack on man in Train : మధ్యప్రదేశ్ లో భోపాల్ నుంచి దామోహ్కు వెళ్తున్న ఓ రైలు రెడ్ సిగ్నల్ పడటంతో ఆగిపోయింది. గ్రీన్ సిగ్నల్ పడితే దూసుకుపోవటానికి రెడీగా ఉంది. అనుకున్నట్లుగానే గ్రీన్ సిగ్నల్ పడింది. నెమ్మది కదిలింది రైలు. వేగం అందుకోవటానికి పికప్ అవుతోంది. సరిగ్గా అప్పుడే జరిగింది ఎవ్వరు ఊహించని ఘటన.
అదే రైలులో ఉన్న ఓ 30 ఏళ్ల మహిళ తన ఎదురుగా ఉన్న యువకుడిపై యాసిడ్ పోసి..అప్పుడే కదులుతున్న రైల్లోంచి దూకేసి క్షణాల్లో కనిపించకుండా ఎస్కేప్ అయ్యింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలోని గంజ్బసోడా రైల్వేస్టేషన్లో సోమవారం (జనవరి 10,2022)రాత్రి జరిగిన ఈ ఘటనలో బాధిత యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ యాసిడ్ దాడి ప్రభావంతో బోగిలో మంటలు చెలరేగాయి. జరిగిందేంటో అర్థం అర్థంకాని అయోమంలో ఉన్న తోటి ప్రయాణీకులు బోగీలో మంటలు చెలరేగేసరికి ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఈ గందగోళంలో ప్రయాణీలకు తీవ్ర భయాందోళనలకు గురై కొంతమంది ఏకంగా ప్రాణ భయంతో రైల్లోంచి దూకారు. దాంతో వాళ్లకూ తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ బాధితుడు సచిన్ సాహుగా గుర్తించారు. యాసిడ్ దాడికి పాల్పడిన గుర్తు తెలియని మహిళ జాడ కోసం వెతుకుతున్నారు.