BJP MLA Raja Singh : మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో జరుగుతుంది..కేసీఆర్.. దమ్ముంటే ఆపండి : రాజాసింగ్ సవాల్

మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.

BJP MLA Raja Singh : మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో జరుగుతుంది..కేసీఆర్.. దమ్ముంటే ఆపండి : రాజాసింగ్ సవాల్

Bjp Mla Rajasingh Challenges Cm Kcr

bjp mla rajasingh challenges cm kcr : సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందని..కేసీఆర్ కు దమ్ముంటే ఆపండీ అంటూ సవాల్ విసిరారు రాజాసింగ్. ప్రజలు ఎన్నుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ భయం పట్టుకుందని అందుకే ఆయన తెలంగాణ వస్తే కేసీఆర్ ఏవో పనులు కల్పించుకుని తప్పించుకు తిరుగుతుంటారు అంటూ ఎద్దేవా చేశారు. రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలు ఇచ్చిన వరద సహాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు పంచడానికే వరద సహాయ నిధులను  అడుగుతున్నారంటూ ఆరోపించారు. ఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందని… తమ పదవులు ఉంటాయనే నమ్మకం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని రాజాసింగ్ చెప్పారు. ఏ క్షణంలోనైనా వారు పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందని.. అన్నారు.

సమయం వచ్చినప్పుడే కాదు సమయాన్ని క్రియేట్ చేసుకుని మరీ టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై రాజాసింగ్ విరుచుకుపడుతునే ఉంటారు. ఈక్రమంలో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసినట్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ ఇటీవల బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కూడా కనిపిస్తాయి అంటూ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేసీ అధిష్టానం శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పలు నాటకీయ పరిణామాల మధ్య సీఎం ఉద్ధవ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చి వేసింది. క్యాంపు రాజకీయాలతో శివసేన ఎమ్మెల్యేలు..ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్ధతుతో శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేను సీఎంగా మాజీ సీఎం ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంగా నియమించింది. అటువంటి పరిస్థితులే తెలంగాణలో కూడా వస్తాయని టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అని..దమ్ముంటే సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అంటూ సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..