దుబాయ్ పీఎస్‌లో మహేష్.. చాలా కష్టపడ్డారంటున్న ట్రైనర్..

దుబాయ్ పీఎస్‌లో మహేష్.. చాలా కష్టపడ్డారంటున్న ట్రైనర్..

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో స్టార్ట్ అయింది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వంలో GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

కొద్ది రోజులుగా దుబాయ్‌లోని పలు బ్యూటిఫుల్ అండ్ పాపులర్ ప్లేసెస్ తాలుకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సూపర్‌స్టార్ రీసెంట్‌గా అక్కడి స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను విజిట్ చేశారు.

ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ పోలీస్‌స్టేషన్ అయిన దుబాయ్‌లోని లా మెర్ స్టేషన్‌కు వెళ్లిన మహేష్ అక్కడి టెక్నాలజీ చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘గల్ఫ్ టుడే’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మహేష్ ఈ సినిమా కోసం ఎంతలా కష్ట పడ్డారో, ఎంతటి కఠినమైన వర్కౌట్స్ చేశారో మహేష్ ఫిట్‌నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఒక్కో వర్కౌట్‌కి దాదాపు 60 నిమిషాల సేపు కష్టపడేవారట.

Mahesh Babu

2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ కెరీర్లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. సంగీతం : థమన్, కెమెరా : మది, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ : ఏ ఎస్ ప్రకాష్, నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట.

Mahesh Babu