Jammu Kashmir: ‘హిజ్బుల్’ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ.. కశ్మీర్లో ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూకశ్మీర్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆరేళ్లుగా హిజ్బుల్ తరఫున పనిచేస్తోన్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
Jammu Kashmir: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూకశ్మీర్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆరేళ్లుగా హిజ్బుల్ తరఫున పనిచేస్తోన్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. జమ్మూకశ్మీర్లోని కిష్త్వాడ్లో తాలిబన్ను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్గ్వారీలోని నాగసేని తాసిల్ వాసి అయిన హుస్సేన్ను రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నాయని పోలీసులు వివరించారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని కుట్రలకు పాల్పడుతోన్న హిజ్బుల్ ముజాహిదీన్ ప్రయత్నాలకు తాలిబ్ హుస్సేన్ అరెస్టుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని చెప్పారు. తాలిబ్ హుస్సేన్ 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరాడని, ఆ ఉగ్రసంస్థలో యువతను చేర్పిస్తున్నాడని తెలిపారు. భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నాయని చెప్పారు. తాలిబ్ హుస్సేన్పై పలు కేసులు ఉన్నాయని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.