చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మమతా మోహన్ దాస్

చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మమతా మోహన్ దాస్

Mamta Mohandas: పాపులర్ యాక్ట్రెస్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. ‘యమదొంగ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు బ్యూటీ ‘విక్టరీ’, ‘హోమం’ ‘కృష్ణార్జున’, ‘కేడి’ వంటి సినిమాల్లో నటించింది. ‘కింగ్’, ‘కథానాయకుడు’(రజినీకాంత్) మూవీల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది..

‘రాఖీ రాఖీ’(రాఖీ), ‘ఆకలేస్తే అన్నంపెడతా’(శంకర్ దాదా జిందాబాద్), ‘36-24-36’(జగడం) వంటి పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ప్రజీత్ పద్మనాభన్ ను 2011లో పెళ్లాడి 2012లో విడాకులు తీసుకుంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా తెలుగు, తమిళ్ సినిమాల్లో పెద్దగా కనిపించ లేదు.. 2009లో ‘కేడి’ లో కనిపించింది. ఇప్పుడు పన్నేండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mamta Mohandas

తమిళ్ లో ప్రభుదేవా తో ‘ఊమై విళిగల్‌’ (Oomai Vizhigal) సినిమాలో నటిస్తోంది. విశాల్ – ఆర్య నటిస్తున్న తెలుగు, తమిళ్ మూవీ ‘ఎనిమి’ లో ఓ కీలక పాత్ర కోసం మమతాను తీసుకున్నారు. రీ ఎంట్రీ తో కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమాల్లో నటిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది మమతా మోహన్ దాస్.