భార్య..స్పైసీ ఫుడ్ వండలేదని..దూకేయబోయాడు..అంతలోనే

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 11:57 AM IST
భార్య..స్పైసీ ఫుడ్ వండలేదని..దూకేయబోయాడు..అంతలోనే

కోపం..ఆవేశం అనేక అనర్థాలకు దారి తీస్తుందని పెద్దలు అంటుంటారు. క్షణాల్లో తీసుకొనే నిర్ణయం ఎన్నో నష్టాలకు కారణమౌతుంది. జీవితాలు నాశనమవుతుంటాయి. ఇలాగే ఓ భార్య స్పైసీ ఫుడ్ వండలేదని..బాల్కానీ నుంచి దూకేశాడు ఓ భర్త. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్…చాంద్ కేడాలో చోటు చేసుకుంది. 

కరోనా కారణంగా చాలా మంది ఇంటి పట్టునే ఉంటున్నారు. టైం పాస్ కావడానికి ఎవో ఎవో పనులు చేసుకుంటూ బిజి బిజీగా గడిపేస్తున్నారు. చాంద్ కేడాలోని కేశవ్ అపార్ట్ మెంట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. స్పైసీగా కూర వండాలని భర్త హుకుం జారీ చేశాడు. ఇప్పుడు చేయను తర్వాత చేస్తానని భార్య చెప్పడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు.

లోకువగా చూస్తోందని అనుకున్నాడో ఏమో..అమాంతం భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బాల్కానీ నుంచి దూకేయబోయాడు. అయితే..ఇతను కిందపడలేదు. బాల్కానీ గోడను పట్టుకుని వేలాడాడు. ఇది అక్కడున్న వారు గమనించారు. కిందకు దూకలేక పైకి వెళ్లలేక అవస్థలు పడ్డాడు. చివరకు చుట్టుపక్కల వారు తలో చేయి వేసి…అతడిని పైకి లాగారు.

హమ్మయ్యా..అనుకున్నారంత. సమాచారం తెలుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటన రెండు, మూడు రోజుల కింద జరిగిందని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని చాందినికేడ పోలీస్ ఇన్స్ పెక్టర్ వెల్లడించారు.