యాభై రూపాయల గొడవ.. వ్యక్తి మృతి

యాభై రూపాయల గొడవ.. వ్యక్తి మృతి

Man killed in Guntur District Clash for Fifty rupees:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 50రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా.. స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పాల డైరిలో రూ.50 అప్పు విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవలో గుమస్తా బాజి అనే యువకుడిపై మిగిలిన వారు పిడిగుద్దులతో దాడి చేయగా.. బాజీ కుప్పకూలిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాజి రోడ్డుపై పడిపోయిన వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.