క్రికెట్ పోటీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా 5 లీటర్ల పెట్రోల్ గిఫ్టు
Petrol gift : క్రికెట్ పోటీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిస్తే నగదు బహుమతో..లేదా ఓ బైకో గిఫ్ట్ గా ఇస్తారు. ఆ పోటీలు జరిగే స్థాయిని బట్టి బహుమతులు ఉంటాయి. కానీ ప్రస్తుతం పెట్రోల్ ధరలు రోజుకో రకంగా పెరుగుతుండటంతో క్రికెట్ మ్యాచ్ లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఓ క్రీడాకారుడికి 5 లీటర్ల పెట్రోల్ టిన్ ను బహుమతిగా ఇచ్చారు. ఇది నిరసన కోసం కావచ్చు..లేదా పరిస్థితులను తెలియజేయటానికి కావచ్చు..
ప్రస్తుతం పెట్రోల్,వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. దేశమంతా ఈ ధరల గురించే చర్చించుకుంటున్నారు. ఇలాగైతే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భోపాల్లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యా్చ్’ కింద ఐదు లీటర్ల పెట్రోల్ను అవార్డుగా అందించిన ఘటన ప్రస్తుత పెట్రోల్ ధరలను ప్రతిబింభిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రికెట్ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్ సుక్లా ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 28,2021) జరిగిన ఫైనల్స్లో సలౌద్దీన్ అబ్బాసీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. అతనికి 5 లీటర్ల్ పెట్రోల్ క్యాన్ గిఫ్టుగా ఇవ్వటం విశేషం..